
Brahmasri Chaganti Koteswara Rao Couple Participates in Census Self-Enumeration
భారత జనగణన కార్యక్రమంలో భాగంగా చాగంటి కోటేశ్వరరావు దంపతులు కాకినాడ రూరల్ ప్రాంతంలో స్వంత నివాసంలో స్వయంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేశారు.ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలందరూ భారత జనగణనలో ఉత్సాహంగా పాల్గొని, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ఖచ్చితమైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమని ఆయన తెలిపారు.