సారాంశం

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వైసీపీ హత్య అంటూ టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. ఎవరు దొంగతనం చేయమన్నారు ఎవరు చనిపోమన్నారు అంటూ ప్రశ్నించారు. దొంగతనానికి సంబంధించి కేసు కూడా నమోదు అయ్యిందన్నారు.

అమరావతి: మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. కోడెల శివప్రసాదరావు మరణం దురదృష్టకరమన్నారు. ఆయన మరణం బాధాకరమని అభిప్రాయపడ్డారు. 

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వైసీపీ హత్య అంటూ టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. ఎవరు దొంగతనం చేయమన్నారు ఎవరు చనిపోమన్నారు అంటూ ప్రశ్నించారు. దొంగతనానికి సంబంధించి కేసు కూడా నమోదు అయ్యిందన్నారు.

కోడెల దొంగతనం చేసినట్లు ఆయనే ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. అందుకు డబ్బులు కూడా కడతాననే ఆయన స్వయంగా ప్రకటించారని చెప్పుకొచ్చారు. కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. 

కోడెల శివప్రసాదరావుపై రెండు కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. ఒకటి దొంగతనం కేసు రెండోది ఆయన కోడలు పెట్టిన కేసు అని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలకు ముఖం చూపించలేక చనిపోయారని అది చాలా దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్.

ఈ వార్తలు కూడా చదవండి

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు