తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రస్తుత సీఎం అర్వింద్ కేజ్రీ వాల్, ఆయన పార్టీ ఆప్ ఘోరంగా ఓటమి పాలయ్యాయి. కాంగ్రెస్ సున్నా సీట్లకు పరిమితమైంది. ఈ దిల్లీ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

09:15 PM (IST) Feb 08
అజిత్, త్రిష జంటగా నటించిన `విడాముయార్చి` మూవీ మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ని తెచ్చుకుంది. ఈ సినిమా ఇటీవల కాలంలో అజిత్ సినిమాల ఓపెనింగ్స్ కంటే తక్కువగానే ఓపెనింగ్స్ సాధించడం గమనార్హం. మొదటి రోజు 26 కోట్లతో ప్రారంభమైన ఈ చిత్రం రెండవ రోజు 67% కంటే ఎక్కువ తగ్గి 8.75 కోట్లు సంపాదించింది. మరి ఆ కథేంటో ఇందులో చూడండి.Vidaamuyarchi Collection Day 2: `విడాముయార్చి` రెండో రోజు కలెక్షన్లు.. అజిత్కి పెద్ద షాక్
09:14 PM (IST) Feb 08
`తండేల్` సినిమా ఎలా పుట్టింది? ఎలా స్టార్ట్ అయ్యిందనేది లీక్ అయ్యింది. అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. పాకిస్తాన్లోని ఓ పోలీస్ దీనికి కారణమని టీమ్ చెబుతుంది. అతను అల్లు అర్జున్ అభిమాని అని, అతని వల్లే ఈ మూవీ పుట్టిందని టీమ్ చెబుతుంది. మరి ఆ కథేంటో చూస్తే, ఈ సినిమా పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న మన జాలర్ల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన విషయం తెలిసిందే. మరి అసలేం జరిగిందనేది తెలియాలంటే ఈ లింక్ చూడాలి. పాకిస్తాన్లో అల్లు అర్జున్ అభిమాని కోరిక నుంచి పుట్టిన `తండేల్`.. అసలేం జరిగిందంటే?
09:08 PM (IST) Feb 08
Top 10 fastest centuries in T20 cricket: ధనాధన్ బ్యాటింగ్, సూపర్ బౌలింగ్ తో ఊహించని మలుపు తిరిగే మ్యాచ్ లకు పెట్టింది పేరు టీ20 క్రికెట్. వన్డే, టెస్టు క్రికెట్ లతో పోలిస్తే టీ20 క్రికెట్ అందించే మజానే వేరు. అయితే, ఈ ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన ప్లేయర్లు ఎవరో తెలుసా?
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
07:54 PM (IST) Feb 08
PM Modi on bjp's big win in delhi: 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ వైరల్ మారాయి.
ఢిల్లీలో బీజేపీ గెలుపుపై ప్రధాని మోడీ ఏమన్నారో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
07:19 PM (IST) Feb 08
ప్రభాస్లాంటి కటౌట్ సందీప్ రెడ్డికి దొరికితే, ఆయన ఏ రేంజ్లో చూపిస్తారో ఊహకు కూడా అందదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రాబోతున్న `స్పిరిట్` చిత్రంపై అదే స్థాయిలో అంచనాలున్నాయి. ఈ మూవీ ఇంకా ప్రారంభం కూడా కాలేదు. కానీ అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చింది. ప్రభాస్ కి సందీప్ పెట్టిన కండీషన్ షాకిస్తుంది. అదేంటో ఈ లింక్లో చూడండి. `స్పిరిట్` విషయంలో సందీప్ రెడ్డి వంగా కండీషన్, ప్రభాస్ అయినా సరే ఆ రూల్ పాటించాల్సిందేనా?
07:16 PM (IST) Feb 08
Indian player hits 7 sixes in a single over: క్రికెట్ లో ఎన్నో ఆసాధ్యం అనుకున్న రికార్డులను పలువురు ప్లేయర్లు సుసాధ్యం చేశారు. అలాంటిదే ఒకే ఓవర్ లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. ఈ అద్భుతమైన రికార్డును ఒక భారత ప్లేయర్ సాధించాడు.
ఆ రికార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
06:41 PM (IST) Feb 08
Delhi Election Results: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ చారిత్రక విజయం సాధించింది. 26 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగురవేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ని చిత్తుగా ఓడించిన బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో విజయోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. లైవ్ చూసేయండి.
05:23 PM (IST) Feb 08
ఎక్కువగా వుండే ప్రాంతాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కంటే ఏఐఎంఐఎం (All India Majlis E Ittehadul Muslimeen) ఎక్కువ ఓట్లు సాధించింది. ఓ నియోజకవర్గంలో అయితే మూడోస్థానంలో నిలిచింది. ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు... కానీ ఓల్డ్ డిల్లీలోని చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
05:01 PM (IST) Feb 08
పవన్ నుంచి చాలా వరకు ఫ్యాన్స్ `ఓజీ` మూవీనే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని గ్యాంగ్స్టర్గా చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అదిరిపోయేలా ఉండటంతో, పవన్ ఇమేజ్కిది కరెక్ట్ గా సెట్ అయ్యే మూవీ అని, పవన్ రేంజ్ ఏంటో చూపించే మూవీ అవుతుందని భావిస్తున్నారు. అందుకోసమే పవన్ ఎక్కడికి వెళ్లినా ఈ మూవీ గురించే అడుగుతుంటారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో `ఓజీ` గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అదేంటో ఇక్కడ చూడండి
OG Update: `ఓజీ`పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన థమన్, అది `ఓజీ` కాదు న్యూక్లియర్ బాంబ్
04:41 PM (IST) Feb 08
Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. రెండున్నర దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఢిల్లీలో బీజేపీ విజయంపై NDA నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. లైవ్ చూసేయండి.
04:28 PM (IST) Feb 08
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. మోదీ మంచి పాలనకు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
03:36 PM (IST) Feb 08
తన వారసుడిని ఎలాగైనా హీరోని చేసి డబ్బు సంపాదించాలని ఆ తండ్రి పెద్ద ప్లానే వేశాడు. నటనలోకి తన కొడుకుని దింపాడు. మొదట్లో అతని నటనని కాదు, అతని రూపాన్ని కూడా విమర్శించారు. కానీ, ఆ హీరో నిజమైన కష్టం, సినిమా మీద ఉన్న ప్రేమ అతన్ని 10 ఏళ్లలో ప్రేక్షకులకు దగ్గర చేసింది. పెళ్లయ్యాక ఈ వారసుడు హీరో కాస్త సైలెంట్ అయ్యాడు. కానీ, నటించేటప్పుడు ప్రేమలో పడ్డ 40 ఏళ్ల హీరోయిన్ ఇంకా అతని ఆలోచనల్లోనే ఉందట. భార్య ఆ హీరోయిన్ వైపు చూడకూడదని చెప్పినా, ఇద్దరూ కలిసి నటించడమే కాదు, అప్పుడప్పుడు కలుసుకుంటున్నారట. మరి ఆ కథేంటో ఇక్కడ చూడండిః భార్య ఉండగానే 40 ఏళ్ల హీరోయిన్తో రొమాన్స్.. టాప్ హీరో బరితెగింపు!
03:17 PM (IST) Feb 08
కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి అనేక కారణాలున్నాయి. అయితే ఆప్ ఓటమిలో కీలకపాత్ర పోషించింది మాత్రం లిక్కర్ స్కామ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే లిక్కర్ స్కాంలో ప్రధాన పాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమనే చెప్పుకోవచ్చు. పూర్తి కథనం ఇక్కడ చదవండి
03:09 PM (IST) Feb 08
Delhi Election Results: ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ దూరమైందని బీజేపీ ఎంపి మనోజ్ తివారీ అన్నారు. న్యూఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడారు. తొలి నుంచి బిజెపి ట్రెండ్స్లో చాలా ముందుందన్నారు. బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు ఆప్కి దూరమయ్యారని.. ఇదే ఓటింగ్ ట్రెండ్లో కనిపించిందన్నారు. ఆప్ అవినీతే, వైఫల్యాలే ప్రజల మద్దతును కోల్పోవడానికి కారణాలుగా చెప్పారు.
02:53 PM (IST) Feb 08
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా, అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా వెలువడుతున్నాయి. మేజిక్ ఫిగర్ (36 సీట్లు) దాటేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. దీంతో ఆప్కి ఓటమి తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ని అధికార దాహమే ఓడిస్తోందన్నారు. కేజ్రీవాల్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడ్డట్లు అనేక ఆరోపణలు వచ్చాయని.. ఢిల్లీ మద్యం కుంభకోణం (లిక్కర్ స్కామ్)తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని చెప్పారు.
02:47 PM (IST) Feb 08
ఢిల్లీ ఎన్నికల ఫలితంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆప్ నేతలు, కార్యకర్తలకూ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.
02:35 PM (IST) Feb 08
తనకోపమే తనకు శత్రువు అని పెద్దలు చెబుతుంటారు. కోపం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలని చెబుతుంటారు. అయితే కోపంగా ఉన్న సమయంలో ముఖం ఎర్రగా మారడాన్ని గమనించే ఉంటాం. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
02:28 PM (IST) Feb 08
కామెడీ నటుడు రెడిన్ కింగ్స్లీ భార్య, సీరియల్ నటి సంగీతకు ఇటీవల సీమంతం వేడుక ఘనంగా జరిగింది. వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.పూర్తి కథనం ఇక్కడ చదవండి.
02:25 PM (IST) Feb 08
నాగ చైతన్య తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య టాలీవుడ్ లో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ, పిఆర్ టీమ్స్ హడావిడి, మీమ్ పేజెస్ గురించి నాగ చైతన్య ఓపెన్ అయ్యారు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
02:17 PM (IST) Feb 08
సినిమా హిట్ అయితే అందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్ల జీవితాలు మారిపోతాయి. హీరోహీరోయిన్ల కెరీర్లపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సినిమా హిట్ అయితే ఓవర్నైట్లో స్టార్స్ అయిపోతారు. ఇటీవల కాలంలో టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్లు, హీరోలు ఇలానే ఓవర్నైట్లో స్టార్స్ అయిపోయారు. కట్ చేస్తే ఆ తర్వాత అన్నీ ఫ్లాప్ సినిమాలే పడటంతో ఫేడౌట్ అయ్యే పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఓ హీరోయిన్ ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల హీరోయిన్ అనిపించింది. తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ చవిచూసింది. మరి ఆమె ఎవరు? ఆ కథేంటో ఈ లింక్ లో చూడండి. ఫస్ట్ సినిమాతోనే రూ.100కోట్లు కొల్లగొట్టింది, కట్ చేస్తే అన్నీ ఫ్లాప్ సినిమాలే, ఎవరా హీరోయిన్?
01:49 PM (IST) Feb 08
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురయ్యింది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థలు కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయారు. గెలుపు సంగతి అటుంచితే రెండోస్థానంలో కూడా నిలవలేకపోయింది. కొన్నిచోట్ల చిన్నచిన్న ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కంటే మెరుగైన ఓట్లు సాధించారు.
01:31 PM (IST) Feb 08
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సీట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం బిజెపి 48 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ కేవలం 22 చోట్ల మాత్రమే ఆధిక్యంలో కనబడుతోంది. గత ఎన్నికల్లో మాదిరిగానే బిజెపి ప్రభావం కనిపించడంలేదు.
01:22 PM (IST) Feb 08
ఎలక్షన్ కమీషన్ విడుదలచేసిన సమాచారం మేరకు ఇప్పటివరకు నలుగురు బిజెపి అభ్యర్థులు, మరో ఇద్దరు ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. షాలిమార్ బాగ్ నుండి రేఖా గుప్త 29 వేలు, రాజోరి గార్డెన్ నుండి మంజీందర్ సింగ్ 18 వేల మెజారిటీ, త్రినగర్ నుండి తిలక్ రామ్ గుప్తా 15 వేల మెజారిటీ, సంగమ్ విహార్ నుండి చందన్ కుమార్ చౌదరి 344 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఆప్ నుండి డిల్లీ కంటోన్మెంట్ లో విరేందర్ సింగ్ 2029 ఓట్లు, కోండ్లీ నుండి కుల్దీప్ కుమార్ 6293 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
01:06 PM (IST) Feb 08
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. డిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ ఉన్నారు. మాజీ సీఎం కేజ్రీవాల్ పై గెలిచిన ఆయనవైపే బిజెపి అధిష్టానం కూడా చూస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే బిజెపి గెలుపు ఖాయంకాగానే ఆయన బిజెపి అగ్రనేతలను కలవడం ప్రారంభించారు. హోంమంత్రి అమిత్ షా ను కలిసారు.
01:02 PM (IST) Feb 08
ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించి సోషల్ మీడియాల్లో క్రేజీ టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ ఓటీటీలోకి ఫిబ్రవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. నెట్ ప్లిక్స్ చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా ఉంది. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 'డాకు మహారాజ్' ఓటీటీ రిలీజ్ పై నెట్ ప్లిక్స్ సైలెన్స్,ఎందుకని?
12:57 PM (IST) Feb 08
డిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి విజయం సాధించారు. కల్కాజీ నుండి పోటీచేసిన ఆమె బిజెపి అభ్యర్థి నుండి గట్టిపోటీని ఎదర్కొన్నా ఎట్టకేలకు గెలిచారు. కానీ ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు చాలామంది మంత్రులు ఓటమిపాలయ్యారు.
12:56 PM (IST) Feb 08
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్రను సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. అవనితీకి వ్యతిరేకంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు తెరపడింది. ఇంతకీ ఆప్ ఓటమికి కారణాలు ఏంటి ఈ పూర్తి కథనంలో తెలుసుకుందాం..
12:44 PM (IST) Feb 08
డిల్లీ ఓటర్లు అనూహ్య తీర్పు ఇస్తున్నారు. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సైతం ఓడించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన కేజ్రీవాల్ 3 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ ఘనవిజయం సాధించారు.
12:37 PM (IST) Feb 08
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓటమిపాలయ్యారు. జంగ్పూరాలో పోటీచేసిన ఆయన 600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలుపొందారు.
12:37 PM (IST) Feb 08
నాగచైతన్య, సమంత ఏడేళ్లు ప్రేమించుకున్నారు. నాలుగేళ్లు కలిసి ఉన్నారు. ఐదేళ్ల క్రితం విడిపోయారు. పెళ్లి చేసుకున్న డేట్కి నాలుగు రోజుల ముందే తమ డైవర్స్ ని ప్రకటించారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే వీరి డైవర్స్ ఏదో రూపంలో టాపిక్గా మారుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. తాజాగా మరోసారి చైతూ దీనిపై స్పందించారు. అదేంటో ఇక్కడ చూడండి. నన్ను క్రిమినల్ లాగా చూస్తున్నారు.. సమంతతో విడాకులపై నాగచైతన్య సంచలన స్టేట్మెంట్
12:25 PM (IST) Feb 08
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయాల ఖాతా తెరిచింది. కస్తూర్బానగర్లో బీజేపీ అభ్యర్థి నీరజ్ విజయం సాధించారు. త్రినగర్లో బీజేపీ అభ్యర్థి తిలక్రామ్ 15,753 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.విశ్వాస్నగర్లో బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్ గెలుపొందారు. కోండ్లీలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ విజయం సాధించారు.
11:47 AM (IST) Feb 08
ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓటమి దిశగా అడుగులు వెస్తున్నారా, 12 ఏళ్ల తర్వాత కేజ్రీవాల్కు తొలిసారి ఎదురుదెబ్బ తగలనుందా.? అంటే తాజా ఫలితాల ట్రెండ్ చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం న్యూఢిల్లీలో కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 2 రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్స్లో కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. 8వ రౌండ్కి 430 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్ ఉన్నారు. ఇంకా 5 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
11:40 AM (IST) Feb 08
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జోరు పెరిగింది. సీట్ల సంఖ్య కాస్త తగ్గినట్లు అనిపించినా మళ్లీ దూసుకుపోతోంది. ప్రస్తుతం బీజేపీ 45 స్థానాల్లో ముందంజలో ఉండగా ఆప్ 25 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇదిలా ఉంటే కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో నాల్గవ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి 1,635 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ప్రస్తుతం వెనుకబడి ఉండడం గమనార్హం.
11:31 AM (IST) Feb 08
హీరోలకు, హీరోయిన్లకు కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ సహజంగానే ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం హీరోయిన్లని డిస్ట్రబ్ చేసేలా ఉంటాయి. వెంకటేష్ తో కలసి నటించిన ఒక హీరోయిన్ కి అలాంటి పరిస్థితి ఎదురైంది. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
11:13 AM (IST) Feb 08
భారతీయ సంప్రదాయాల్లో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. మన పెద్దలు కొన్ని విషయాలను మనకు చిన్ననాటి నుంచి ఒక అలవాటుగా మార్చేస్తుంటారు. అయితే వీటిని కొందరు మూఢనమ్మకంగా భావిస్తుంటారు. మరికొందరు మాత్రం వీటిలోనూ సైన్స్ దాగి ఉందని చెబుతుంటారు. అలాంటి ఒక నమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
10:58 AM (IST) Feb 08
న్యూడిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు బిజెపి స్పష్టమైన ఆధిక్యంతో కనిపించినా మెళ్లిగా ఆప్ పుంజుకుంటోంది. ప్రస్తుతం బిజెపి 40, ఆప్ 30 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా 10 సీట్లలో రెండు పార్టీల మధ్య కేవలం వెయ్యి ఓట్ల తేడా మాత్రమే ఉంది. మరో 14 సీట్లలో రెండు పార్టీల మధ్య 3000 ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇలా రెండు పార్టీల మధ్య అత్యల్ప తేడా ఉందికాబట్టి ఫలితాలు ఎలాగైనా ఉండవచ్చు.
బిజెపి, ఆప్ మద్య రౌండ్ రౌండ్కు ఆధిక్యం మారుతోంది. ఇక ఇప్పటివరకు వెనుకంజలో వున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ ఐదు రౌండ్ల తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు. ఆయన 386 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా కూడా జంగ్పురాలో 2345 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
10:23 AM (IST) Feb 08
పండ్లు ఆరోగ్యానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పండ్లను తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను రాత్రుళ్లు అస్సలు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏంటి.? రాత్రుళ్లు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
10:19 AM (IST) Feb 08
తండేల్` మూవీ పాజిటివ్ టాక్ కలెక్షన్ల పరంగానూ బూస్ట్ ఇస్తుంది. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ నాగచైతన్య కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఆయన కెరీర్లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే మూవీగా నిలుస్తుందని సినీ వర్గాలు, ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఫస్ట్ డే కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. అయితే టీమ్ ఇంకా కలెక్షన్లని ప్రకటించలేదుగానీ, ప్రస్తుతం కొన్ని ఫీగర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండిః Thandel Day 1 Collections: దుమ్మురేపుతున్న `తండేల్` కలెక్షన్లు.. నాగచైతన్య కెరీర్లోనే హైయ్యెస్ట్ ?
09:31 AM (IST) Feb 08
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. చివరకు ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిషి కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్ పై బిజెపి అభ్యర్థి పర్వేష్ వర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
09:15 AM (IST) Feb 08
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తుంటే బీజేపీ ఇప్పటికే లీడింగ్లో మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ప్రస్తుతం బీజేపీ 37 స్థానాల్లో ముందజలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఒక స్థానం లీడ్లో ఉంది. ఇక ఆప్ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం ఒక చోట లీడ్లో ఉంది.