అభివృద్ధి గెలిచింది.. ఢిల్లీలో సుపరిపాలన అందిస్తాం: పీఎం మోడీ
PM Modi on bjp's big win in delhi: 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ వైరల్ మారాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Delhi Election Results - PM Modi: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత న్యూఢిల్లీ అసెంబ్లీని తిరిగి కైవసం చేసుకున్నందుకు బీజేపీని అభినందిస్తూ.. విక్షిత్ భారత్ నిర్మాణంలో ఢిల్లీకి ప్రధాన పాత్ర ఉండేలా పార్టీ చూస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో బీజేపీ గెలుపును అభివృద్ధి గెలుపుగా, సుపరిపాలన గెలిచిందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దాదాపు 26 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంది.
ఢిల్లీని అభివృద్దివైపు పరుగులు పెట్టిస్తాం : ప్రధాని మోడీ
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన గొప్ప విజయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రశంసించారు. "అభివృద్ధి, సుపరిపాలన గెలిచింది" అని X లో పోస్ట్లో పేర్కొన్నారు. "బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు నా సోదర సోదరీమణులందరికీ నా వందనం.. అభినందనలు... మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు..." అని శ్రీ మోడీ పేర్కొన్నారు.
ఈ అద్భుతమైన విజయాన్ని అందించినందుకు ఢిల్లీని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తామని ప్రధాని తెలిపారు. "ఢిల్లీ సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి, ఈ ప్రాంత ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మేము ఎటువంటి అవకాశాన్ని వదులుకోబోమని మేము హామీ ఇస్తున్నాము... అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో ఢిల్లీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది" అని ప్రధాని తెలిపారు.
ఢిల్లీ ప్రజలకు సేవలో ముందుంటాము.. వారిని చూస్తూ గర్వంగా ఉంది : ప్రధాని మోడీ
ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామనీ, బీజేపీ కార్యకర్తలను చూస్తే గర్వంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. "ఈ భారీ తీర్పు కోసం పగలు, రాత్రి పనిచేసిన నా బీజేపీ కార్యకర్తలందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు మేము ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి మరింత బలంగా అంకితభావంతో ఉంటాము" అని ప్రధానమంత్రి అన్నారు.
హోంమంత్రి అమిత్ షా కూడా ఢిల్లీ లో బీజేపీ విజయం గురించి X లో పోస్ట్ లో స్పందించారు. ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలను మోసం చేసేవారికి ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అలాంటి ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నామని తెలిపారు. "వాగ్దానాలను విస్మరించే వారికి ఢిల్లీ ఒక గుణపాఠం నేర్పింది... తప్పుడు వాగ్దానాలు చేసే వారికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది" అని అమిత్ షా అన్నారు.
ఆమ్ ఆద్మీకి షాకిచ్చిన ఢిల్లీ ప్రజలు
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీని అసలే పట్టటించుకోలేదు. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా దేశ రాజధానిలో బీజేపీ విజయం సాధించి అధికార పీఠం దక్కించుకుంది.
ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి దశలోనే బీజేపీ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది, ఢిల్లీలోని 70 సీట్లలో 50 సీట్లలో ఆధిక్యాన్ని నమోదు చేసింది, ఆ తర్వాత ఆప్ స్వల్పంగా పోటీ పడింది. కానీ మధ్యాహ్నం 2.30 గంటల నాటికి, 85 శాతానికి పైగా ఓట్లు లెక్కించబడిన తర్వాత, పోటీ స్థిరపడింది. కాషాయ పార్టీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
2015లో మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ
గతంలో ఆప్ 2015 ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2015లో కేవలం మూడు సీట్లు, 2020లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది. 2020లో ఆప్, బీజేపీ మధ్య ఓట్ల వాటా అంతరం 15 శాతంగా ఉంది. ఆదాయపు పన్ను రాయితీ పెంపు, మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీలతో మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడం ద్వారా ఢిల్లీలో బీజేపీ ప్రభంజనం కొనసాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ అసెంబ్లీలో ఓటమిపాలైన తర్వాత ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నామనీ, ప్రజల మార్పు తీర్పునకు అనుగునంగా పాలన సాగించాలని కోరుతూ బీజేపీ శుభాకాంక్షలు తెలిపారు.
"ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు ప్రకటించారు. మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాము. ప్రజల నిర్ణయం అత్యంత ముఖ్యమైనది. బీజేపీ విజయం సాధించినందుకు నేను అభినందిస్తున్నాను. అది వారికి మెజారిటీ ఇచ్చిన ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను" అని కేజ్రీవాల్ అన్నారు.