థర్డ్ పార్టీ విచారణకు శరద్ పవార్, శరద్ యాదవ్ ల మద్దతు

By Nagaraju TFirst Published Oct 31, 2018, 7:06 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఘటనను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై దాడి, దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రంలోని పెద్దలకు వివరిస్తున్నారు. 

ఢిల్లీ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఘటనను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై దాడి, దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రంలోని పెద్దలకు వివరిస్తున్నారు. 

జగన్ పై దాడి కేసులో రాష్ట్రప్రభుత్వం నేతృత్వంలో జరుపుతున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. డీజీపీ ఏర్పాటు చేసిన సిట్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనే నమ్మకం లేదని థర్డ్‌ పార్టీ విచారణ జరిపించాలని కోరారు. దాడి జరిగిన ప్రదేశం కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్లారు. కేంద్రం ఏం చేయగలదో అది చేస్తామని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. 

బుధవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. వైఎస్ జగన్ పై హత్యాయత్నం ఘటన వివరాలు, రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందని ఏచూరికి వివరించారు. 

అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్ జేడీ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ లను కలిశారు. జగన్ పై దాడి విషయాన్ని నేతల దృష్టికి తీసుకువెళ్లారు నేతలు. జగన్ పై దాడి ఘటనకు సంబంధించి న్యాయవిచారణ లేదా థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని కోరారు. దీంతో థర్డ్ పార్టీ విచారణకు శరద్ పవార్, శరద్ యాదవ్ లు మద్దతు ప్రకటించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీ డైరెక్షన్ లో జగన్ డ్రామా, అల్లర్లకు కుట్ర:మంత్రి కొల్లు రవీంద్ర

మిస్డ్ కాల్ వస్తే ఫోన్ చేశా: జగన్‌‌పై దాడి కేసులో గుంటూరు మహిళ

దాడి జరిగిన తర్వాత జగన్ విశాఖలో ఎందుకు ఆగలేదంటే......

శ్రీనివాస్ కి భద్రత కల్పిస్తాంః:హోం మంత్రి చినరాజప్ప భరోసా

జగన్ స్టేట్‌మెంట్‌కోసం మరోసారి ఏపీ పోలీసుల యత్నం

చంద్రబాబు ప్రతివాదిగా కోర్టులో పిటిషన్: జగన్ వాదన ఇదీ

మల్లెల బాబ్జీకి పట్టిన గతే శ్రీనివాస్ కు,శివాజీ కూడా కుట్రదారుడే :తమ్మినేని

దాడి కేసు విచారణపై హైకోర్టులో జగన్ పిటిషన్....ప్రతివాదిగా చంద్రబాబు
జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

click me!