ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

Published : Jun 20, 2019, 04:04 PM ISTUpdated : Jun 20, 2019, 05:27 PM IST
ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

సారాంశం

టీడీపీ లో ముసలం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారనే ప్రచారం మొదలైంది.

టీడీపీ లో ముసలం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ సంఘటన పార్టీ కార్యకర్తలను కలవర పెడుతోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. తాము బీజేపీ అనుబంధ ఎంపీలుగా ఉంటామని తేల్చి చెప్పారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కాకినాడలో ప్రత్యేకంగా కాపు నేతలు సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడుతున్నారు.

అంతేకాకుండా మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కనకమేడల, సీతామహాలక్ష్మీని కూడా బీజేపీలోకి చేర్చేందుకు సుజనా, సీఎం రమేష్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎంపీలతో పాటు లోక్‌సభ ఎంపీలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరు కూడా ప్రధానంగా వినపడుతోంది.

ఆ నలుగురు రాజ్యసభ ఎంపీలతోపాటు కేశినేని కూడా కమలం గూటికి చేరతారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే కేశినేని నాని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెబుతూనే ఉన్నారు. బీజేపీ అధిష్టానంతో కూడా కేశినేని చర్చలు జరిపినట్లు సమాచారం. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.  

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu