తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ఇవాళ ఇరురాష్ట్రాల ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘించడం వల్లే కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్లో పోలింగ్ శాతంలో పెద్దగా మార్పు కనిపించేలా లేదు. గతంలోనూ అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైన జిల్లా హైదరాబాదే. ఈ సారి కూడా ఇదే తీరు కొనసాగించేలా ఉన్నది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సగటు పోలింగ్ శాతం 52 ఉండగా.. హైదరాబాద్లో మాత్రం 32 శాతమే నమోదు కావడం గమనార్హం.
తన అనారోగ్యం తన హక్కును వాడుకోవడానికి అడ్డంకి కాదనుకున్నారు. తన ఓటు మరెవరో దొంగ ఓటుగా వేయడానికి అవకాశం ఇవ్వద్దు అనుకున్నారాయన.
హైదరాబాదులో అత్యల్పంగా 12.39% పోలింగ్ నమోదయ్యింది.. మెదక్ జిల్లాలో అత్యధికంగా 30.27 పోలింగ్ నమోదయ్యింది.
జనగామలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
హైదరాబాద్ ఓటర్లు మందకొడిగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అతితక్కువ పోలింగ్ నమోదయ్యింది. వరుసగా సెలవులు రావడంతో ఓటింగ్ ప్రభావితం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
జనగామలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేసింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ అవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.