హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం నుండే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలను ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 68 నియోజకవర్గాల 55.92 లక్షల మంది ఓటర్లు ఓటేయనున్నారు. అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 400మందికి పైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.