10:38 PM (IST) May 13

కడప జిల్లా జమ్మలమడుగు లో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి

ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
 

06:02 PM (IST) May 13

ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ నమోదు ఇలా..

అల్లూరి సీతారామరాజు – 55.17 
అనకాపల్లి – 65.97 
అనంతపురం – 68.04 
అన్నమయ్య – 67.63 
బాపట్ల 72.14 
చిత్తూరు – 74.06 
అంబేద్కర్ కోనసీమ -73.55 
ఈస్ట్ గోదావరి – 67.93 
ఏలూరు – 71.10 
గుంటూరు – 65.58 
కాకినాడ – 65.01 
కృష్ణ జిల్లా – 73.53 
కర్నూలు – 64.55 
నంద్యాల – 71.43 
ఎన్టీఆర్ జిల్లా – 67.44 
పల్నాడు – 69.10 
పార్వతీపురం మన్యం – 61.18 
ప్రకాశం – 71.00 
నెల్లూరు – 69.95 
సత్యసాయి జిల్లా – 67.16 
శ్రీకాకుళం – 67.48 
తిరుపతి – 65.88 
విశాఖ – 57.42 
విజయనగరం – 68.16 
పశ్చిమ గోదావరి – 68.98 
వైయస్ఆర్ జిల్లా – 72.85
 

05:50 PM (IST) May 13

ఏపీలో 5 గంటల వరకు 68 శాతం పోలింగ్, తెలంగాణలో 61 శాతం పోలింగ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61. 16 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు.
 

05:32 PM (IST) May 13

చంద్రగిరిలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు

ఏపీలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువలో వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
 

05:05 PM (IST) May 13

నరసరావుపేటలో ఉద్రిక్తత

ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. 

04:44 PM (IST) May 13

ప్రకాశం జిల్లా దర్శిలో ఈవీఎం ధ్వంసం

ఏపీలో పలుచోట్ల హింస్మాత సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోగా.. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 

04:09 PM (IST) May 13

ఏపీలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

- అరుకు, రంపచోడవరం, పాడేరు
 

04:06 PM (IST) May 13

తెలంగాణ లో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణ లో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

సిర్పూర్, 
ఆసిఫాబాద్, 
బెల్లంపల్లి, 
చెన్నూరు, 
మంచిర్యాల,
మంథని, 
భూపాలపల్లి, 
ములుగు, 
పినపాక, 
ఇల్లెందు, 
కొత్తగూడెం, 
అశ్వారావుపేట, 
భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.

-- 9,900 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

- క్యూలో ఉన్నవారికే అవకాశం

 

04:01 PM (IST) May 13

తెలంగాణలో పార్లమెంట్ వారిగా పోలింగ్ వివరాలిలా.. (3 గంటల వరకు)

ఆదిలాబాద్ - 62.44 శాతం, 
భువనగిరి - 62.05 శాతం, 
చేవెళ్ల - 42.35 శాతం, 
హైదరాబాద్‌- 29.47శాతం, 
కరీంనగర్‌ - 58.24 శాతం, 
ఖమ్మం - 63.67 శాతం, 
మహబూబాబాద్ - 61.40 శాతం, 
మహబూబ్‌నగర్‌ - 58.92 శాతం, 
మల్కాజ్‌గిరి - 37.69 శాతం,
మెదక్- 60.94 శాతం, 
నాగర్‌కర్నూల్‌- 57.17 శాతం, 
నల్లగొండ - 59.91 శాతం,
నిజామాబాద్‌లో 58.70 శాతం, 
పెద్దపల్లి- 55.92 శాతం, 
సికింద్రాబాద్‌- 35.48 శాతం, 
వరంగల్‌ - 54.17 శాతం, 
జహీరాబాద్‌ - 63.96 శాతం .
 

03:40 PM (IST) May 13

తెలంగాణలో 52.30 శాతం దాటిన పోలింగ్...

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52.30 శాతం మార్కు దాటింది.ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల సంఘం అధికారులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.94 శాతం పోలింగ్ కాగా, మెదక్‌లో 60.94 శాతం, వరంగల్‌లో 54.17 శాతం, ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్‌ నమోదు
 

03:32 PM (IST) May 13

ఏపీలో 52 శాతం దాటిన పోలింగ్...

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52 శాతం మార్కు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

03:23 PM (IST) May 13

తెలంగాణలో 1 గంట వరకు 40.38శాతం పోలింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్

1 గంట వరకు 40.38శాతం పోలింగ్ 

ఆదిలాబాద్ -50.18 శాతం
భువనగిరి -46.49 శాతం
చేవెళ్ల -34.56 శాతం
హైద్రాబాద్ -19.37 శాతం
కరీంనగర్-45.11 శాతం
ఖమ్మం-50.63 శాతం
మహబూబాబాద్-48.81 శాతం
మహబూబ్నగర్-45.84 శాతం
మల్కాజిగిరి-27.69 శాతం
మెదక్-46.72 శాతం
నాగర్ కర్నూల్ -45.88 శాతం
నల్గొండ-48.48 శాతం
నిజామాబాద్-45.67 శాతం
పెద్దపల్లి-44.87 శాతం
సికింద్రబాద్-24.91 శాతం
వరంగల్-41.23 శాతం
జహీరాబాద్-50.71 శాతం
 

02:43 PM (IST) May 13

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అభ్యర్థి మాధవీలత పై కేసు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయ్యింది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు అతడిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కూడా మలక్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
 

01:30 PM (IST) May 13

ఒంటిగంట వరకు తెలంగాణ, ఏపీలో  40 శాతం పోలింగ్

తెలంగాణలో ఒంటిగంట వరకు  40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 36 శాతంమంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఓటేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 
 

12:30 PM (IST) May 13

ఓటుహక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటేసారు. భార్య కూతురితో కలిసివెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.    

Scroll to load tweet…


 

12:12 PM (IST) May 13

ఓటేసిన కేసీఆర్ ... మొదటిసారి ఓటేసిన హిమాన్షు

తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. చింతమడక పోలింగ్ బూత్ కు భార్య శోభతో కలిసివచ్చి ఓటేసారు కేసీఆర్. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కుటుంబం మాత్రం హైదరాబాద్ లో ఓటేసింది. కేసీఆర్ మనవడు హిమాన్షు మొదటిసారి ఓటేసాడు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

 

12:06 PM (IST) May 13

హైదరాబాద్ ఓటర్లపై మంచులక్ష్మి సీరియస్....

హైదరాబాద్ లో సినీప నటులు మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటేయడానికి బద్దకిస్తున్న హైదరాబాదీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను  ఓటేయడానికే ముంబై నుండి హైదరాబాద్ వచ్చాను... కానీ ఇక్కడే వున్నవారు ఇళ్లలోంచి కూడా బయటకు రాకపోవడం దారుణమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసారు.

Scroll to load tweet…


 

11:39 AM (IST) May 13

ఏపీ తెలంగాణలో 11 గంటలవరకు పోలింగ్ శాతం...

తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.25 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 24 శాతం పోలింగ్ నమోదయ్యింది. 
 

11:37 AM (IST) May 13

ఓటేసినమాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, మంత్రి సీతక్క

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో హరీష్, హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ఓటేసారు. మంత్రి సీతక్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. 
 

11:15 AM (IST) May 13

తెనాలి ఎమ్మెల్యే చెంపపగలగొట్టిన ఓటర్....

తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఎమ్మెల్యే ఓ ఓటర్ పై చేయిచేసుకోగా... ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులంతాసదరు ఓటర్ పై దాడికి దిగారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. 

Scroll to load tweet…