Chandrayaan 3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయంతంగా దిగింది. చంద్రుడిపై అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబారాలు అంబరాన్నంటాయి. ల్యాండింగ్ కార్యక్రమాన్ని ఇస్రో తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో కోట్లాది మంది లైవ్ వీక్షించారు.