Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్-3 అంతరిక్ష మిషన్ ఈ ఏడాది ఆగస్టు లో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి (సైన్స్ అండ్ టెక్నాలజీ) డాక్టర్ జితేందర్ సింగ్ వెల్లడించారు. పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సంబంధిత వివరాలు తెలియజేశారు.