పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం తన ప్రతిష్టాత్మక సంక్షేమ, నిర్దేశిత విధానాల, పథకాల అమలుకు నిధులు సమకూర్చుకుంటున్నది. ఈ ఏడాది ఎయిరిండియా, బీపీసీఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తదితర సంస్థల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నత్తనడకన సాగుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాల్లో వెనుకబడిన కేంద్ర సర్కార్... ప్రస్తుత ఏడాది లక్ష్యాలనే వచ్చే ఏడాది కొనసాగించాలని భావిస్తోంది.