వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించే టైం దగ్గర పడుతోంది. రెండేళ్ల క్రితం మాంద్యంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతూ ఉంటే.. మన దేశ వ్రుద్ధిరేటు ఎనిమిది శాతంగా నమోదైంది. కానీ రెండేళ్లలోనే పరిస్థితి తిరగబడింది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. నోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి రంగం, జీఎస్టీ అమలులోకి వచ్చాక చిన్న వ్యాపారులు చేతులెత్తేశారు. ఉపాధి లేక డిమాండ్ కొరవడడంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించడం సవాలే.