• All
  • 261 NEWS
  • 40 PHOTOS
  • 18 VIDEOS
334 Stories
Asianet Image

Budget 2020: ఆయన బడ్జెట్‌ స్పీచ్ దేశ గతినే మార్చేసింది...

Jan 30 2020, 10:16 AM IST

2024 నాటికి భారతదేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముందుకు వెళుతున్నది. అయితే, అంతర్జాతీయంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరుకోవడంతో అహర్నిశలు దేశ అభ్యున్నతి కోసం ఓ ఆర్థిక వేత్త చేసిన క్రుషి దాగి ఉన్నది. అచేతనావస్థలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు ఆయన. ఆయనే మన్మోహన్ సింగ్. 1991-92లో చెల్లింపులకు రుణాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్.. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు తెర తీసి విప్లవాత్మక మార్పులతో దేశ పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించారు. నాడు ఆయన తొలి బడ్జెట్ ప్రసంగమే కార్పొరేట్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిందంటే అతిశయోక్తి కాదు.

Asianet Image

Budget 2020: ఎలక్ట్రిక్ కార్లకు ఐటీ... విద్యుత్ సైకిళ్లపై జీఎస్టీ...

Jan 29 2020, 11:15 AM IST

వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ వెలుగు చూసేందుకు మరో రెండు రోజుల టైం మాత్రమే ఉంది. వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖులు తమకు రాయితీలు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. దశాబ్దంలోనే కనిష్ఠ స్థాయికి పతనమైన వాహనాల విక్రయం పెరుగుదలతోపాటు జీడీపీ వ్రుద్ధి కోసం ఎలక్ట్రిక్ సైకిళ్లపై జీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని హీరో సైకిల్స్ కోరింది. మరోవైపు స్క్రాపేజీ పాలసీని ప్రకటించడం వల్ల వాహనాల కొనుగోలుకు డిమాండ్ పెరిగి ప్రభుత్వాదాయం గణనీయంగా వ్రుద్ధి సాధిస్తుందని టయోటా కిర్లోస్కర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ చెప్పారు.

Top Stories