Asianet News TeluguAsianet News Telugu

CAA Protest : అసదుద్దీన్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ)కి వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళనకు దిగారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ)కి వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళనకు దిగారు. శుక్రవారం హైదరాబాద్ పాతబస్తీలో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసదుద్దీన్‌తో పాటు పాతబస్తీకి చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనవరి 26 తర్వాత కూడా ఎన్ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతాయని ఒవైసీ తెలిపారు.