Asianet News TeluguAsianet News Telugu

ఇల్లిక్కడ ఎందుకు కట్టుకున్నవ్ అనుడేంది కేసీఆర్.. మండిపడుతున్న ప్రతిపక్షాలు..

వర్షాలు తగ్గి మూడు రోజులు గడుస్తున్నా హైదరాబాద్ లో పరిస్థితి ఇంకా నార్మల్ కి రాలేదు. 

వర్షాలు తగ్గి మూడు రోజులు గడుస్తున్నా హైదరాబాద్ లో పరిస్థితి ఇంకా నార్మల్ కి రాలేదు. పలు కాలనీలు ఇంకా మోకాలు లోతు నీటిలోనే మునిగి ఉన్నాయి. పడవల్లో వెడితే కానీ ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి. మరోవైపు చెరువులు మత్తడి దుంకుతుండడంతో ఆ నీళ్లు స్లమ్ లలోకి చేరి వారి పరిస్థితి మరింత దారుణంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలు రామాంతాపూర్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అవసరమైన సహాయచర్యలు చేస్తున్నారు. హైదరాబాద్ ను మహాసముద్రంగా మార్చేసిన ఘనత కేసీఆర్ దే నంటూ మండి పడుతున్నారు.