Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్ల జిల్లాలో దారుణం... భూతగాదాలో రైతును గొడ్డళ్లతో నరికిన ప్రత్యర్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూతగాదాలు చివరకు ఒకరిపై హత్యాయత్నానకి దారితీసిన ఘటన కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జరిగింది. భూతగాదాల నేపథ్యంలో గురక ఎల్లయ్య అనే రైతుపై అదే గ్రామానికి చెందిన కొందరు కర్రలు, గొడ్డళ్లతో దాడిచేసారు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోగా తండ్రి కోసం వచ్చిన కొడుకును సైతం గొడ్డళ్లతో వెంటపడ్డారు. వారికి చిక్కకుండా ఊళ్లోకి వెళ్లిన బాలుడు గ్రామస్తులను వెంటపెట్టుకుని ఘటనాస్థలికి వెళ్లాడు. అప్పటికే అపస్మారక స్థితిలో పడివున్న ఎల్లయ్యను కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Video Top Stories