Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ టు యాదగిరిగుట్ట... జెండా ఊపి స్పెషల్ బస్ సర్వీస్ ప్రారంభించిన గంగుల

 కరీంనగర్ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కరీంనగర్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటుచేసారు.

 కరీంనగర్ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కరీంనగర్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటుచేసారు. తెలంగాణ పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేసి ఈ బస్ సర్వీస్ లను ప్రారంభించారు. కరీంనగర్ బస్టాండ్ లో యాదాద్రికి వెళ్లే బస్సుకు గుమ్మడికాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సర్వాంగసుందరంగా పున:నిర్మించిన యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించేందుకు కరీంనగర్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అయితే సరయిన రవాణా సదుపాయం లేక ఇబ్బందిపడుతున్న ప్రజల కోసమే యాదాద్రికి ప్రత్యేక బస్ సర్వీసులు ప్రారంభించామని... ఈ అవకాశాన్ని కరీంనగర్ వాసులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గంగుల సూచించారు.