Asianet News TeluguAsianet News Telugu

రెండోవిడత కంటివెలుగు ... కరీంనగర్ లో జోరుగా కంటి పరీక్షలు

కరీంనగర్ : తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమయ్యింది. 

కరీంనగర్ : తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న డిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సిపిఐ నేత డి రాజాతో కలిసి ఖమ్మం జిల్లాలో కంటివెలుగు రెండోవిడతను ప్రారంభించారు. దీంతో ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ పట్టణంలోని 42వ డివిజన్ లో మంత్రి గంగుల కమలాకర్, జమ్మికుంటలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఈ కంటివెలుగు రెండోవిడతను ప్రారంభించారు.