Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో తొలి టీకా తీసుకున్న కృష్ణమ్మ మాట ఇదీ....

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. దీంతో హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి ఎస్. కృష్ణమ్మ మొదటి టీకాను తీసుకున్నారు. దీంతో కోవిడ్ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా ఆమె రికార్డు లోకి ఎక్కింది.

అయితే టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు. అటు ఉస్మానియా హాస్పిటల్ లో కూడా కరోనా టీకా కార్యక్రమం మొదలయ్యింది. మొదటి వాక్సినేషన్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నరేందర్ తీసుకున్నారు. 
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పాల్గొన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 4,170 మంది వైద్యారోగ్య శాఖ సిబ్బందికి టీకాలు తీసుకోనున్నారు.