Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ అతిథులతో కేసీఆర్ అల్పాహారం... దగ్గరుండి వడ్డించిన కేటీఆర్

హైదరాబాద్ : ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనుంది.

హైదరాబాద్ : ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే దేశ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు స్పష్టంచేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పార్టీ మార్పు ప్రకటన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు చెందిన అతిథులను కూడా ఆహ్వానించారు. ఇలా ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు వీసీకే చీఫ్ తోల్తిరుమావళవన్ తో పాటు ఇతర అతిథులకు ప్రగతి భవన్ లో అల్పాహారం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో కలిసి అతిథులు అల్పాహారం తీసుకోగా మంత్రి కేటీఆర్ దగ్గరుండి వడ్డించారు.