Asianet News TeluguAsianet News Telugu

చినజీయర్ స్వామిని కలిసిన జగన్ (వీడియో)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిశారు. శనివారం ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్... అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామి దివ్యసాకేత ఆశ్రమానికి చేరుకున్నారు.

జగన్‌కు స్వామిజీతో పాటు శిష్య బృందం ఘనస్వాగతం పలికింది. అనంతరం చినజీయర్ ఆశీస్సులు తీసుకున్న వైసీపీ చీఫ్ పలు అంశాలపై మాట్లాడారు. జగన్ వెంటన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.