Asianet News TeluguAsianet News Telugu

ఏలూరులో దారుణం... ప్రియుడి చేతిలో వివాహిత, కూతురు దారుణ హత్య

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో తల్లీ కూతుళ్లు యేసుమరియమ్మ(32), అఖిల(15)  దారుణ హత్యకు గురయ్యారు. =

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో తల్లీ కూతుళ్లు యేసుమరియమ్మ(32), అఖిల(15)  దారుణ హత్యకు గురయ్యారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే మహిళతో పాటు ప్రియురాలితో పాటు మైనర్ కూతురును హతమార్చి వుంటాడని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  ఫారెన్సీక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పరారీలో వున్న అనుమానిత వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.