Asianet News TeluguAsianet News Telugu

తహసిల్దార్ పై వందమంది మహిళల దాడి.. ఎందుకంటే..

కృష్ణ జిల్లా, నూజివీడు ముసునూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

కృష్ణ జిల్లా, నూజివీడు ముసునూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన చుండ్రు వెంకటరత్నంకు చెందిన భూమి తాలూకు 
రికార్డులను తారుమారు చేశారంటూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట  గ్రామస్తులు ధర్నాకు దిగారు. రాజశేఖర్ అనే యువకుడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించి తాసిల్దార్ కార్యాలయాన్ని దళితులు ముట్టడించారు. తహసిల్దార్ ను బైటికి లాగి దాడి చేసే ప్రయత్నం జరిగింది. పోలీసులు అడ్డుకుని గ్రామస్తులతో చర్చలు చేస్తున్నారు.