Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నాని, వంశీ పోటోలతో కవ్వించేలా ప్లెక్సీలు... టిడిపి, వైసిపి శ్రేణుల ఘర్షణ

గన్నవరం : తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

గన్నవరం : తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టిడిపి శ్రేణులను కవ్విస్తూ వైసిపి నాయకులు బ్యానర్లు ఏర్పాటుచేసారు. ఈ బ్యానర్ల నిలబడి వైసిపి అనుకూలంగా, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టిడిపి, వైసిపి నాయకుల మద్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులతో టిడిపి శ్రేణులు వాగ్వాదానికి దిగారు.  వైసిపికి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ టిడిపి నాయకులు మండిపడ్డారు.