గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డిని గెలిపించండి..: నందమూరి బాలకృష్ణ

హిందూపురం : వచ్చేఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరపున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. 

Share this Video

హిందూపురం : వచ్చేఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరపున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఉన్నత విద్యావంతుడు, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం నాయకుడిగా చాలా అనుభవం కలిగిన ఆయనను ఉమ్మడి కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులు, నందమూరి అభిమానులు, టిడిపి కుటుంబసభ్యులు గెలిపించుకోవాలని సూచించారు. వైసిపి ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సదవకాశం అన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటుహక్కును పొందేందుకు జరుగనున్న ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని బాలయ్య పిలుపునిచ్చారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video