Asianet News TeluguAsianet News Telugu

టిడిపి నేతల అరెస్టుల పర్వం... మచిలీపట్నంలో మాజీ మంత్రి, గుడివాడలో మాజీ ఎమ్మెల్యే

మచిలీపట్నం : కృష్ణా జిల్లాలో టిడిపి నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 

మచిలీపట్నం : కృష్ణా జిల్లాలో టిడిపి నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసిపి కార్యాలయం కోసం మచిలీపట్నంలో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రవీంద్రను వెంటనే విడుదల చేయాలంటూ టిడిపి శ్రేణులు గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
ఇక ఇదే కృష్ణా జిల్లాలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. గుడివాడ నియోజకవర్గం నాగవరప్పాడులో పేదల గుడిసెలను తొలగిస్తున్న అధికారులను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. వైద్య పరీక్షల కోసం పమిడిముక్కల స్టేషన్ నుండి గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కు రావిని తరలించారు పోలీసులు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసులు మొహరించారు.  
 

Video Top Stories