ఏపీలో రేషన్ డీలర్ల మెరుపు సమ్మె.. ఆగిన ఎనిమిదవ విడత రేషన్ పంపిణీ..
ఏపీలో రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు.
ఏపీలో రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. విశాఖ జిల్లా, మాకవరపాలెంలో రేషన్ డీలర్ల యూనియన్లన్నీ కలిసి సామూహిక సమ్మెకు దిగారు. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కావల్సిన ఎనిమిదో విడత రేషన్ పంపిణీపై పడింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించే వరకూ పంపిణీని నిలిపివేస్తున్నట్లు డీలర్ల ప్రకటించారు. సీఎం జగన్ స్పందించి న్యాయం చేసే వరకు రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నారు. ఏడు విడతలుగా పంపిణీ చేస్తే రెండు విడతలు మాత్రమే కమిషన్ ఇచ్చారని డీలర్లు అంటున్నారు. కనీసం మాస్కులు, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదన,ి ఆరుగురు రేషన్ డీలర్లు కరోనాతో మరణిస్తే కనీసం ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.