Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి మోపిదేవి

అన్ లాక్ 1.0లో భాగంగా నేటినుంచి ఆలయాలు తెరుచుకున్నాయి.

అన్ లాక్ 1.0లో భాగంగా నేటినుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. దీంట్లో భాగంగా ఎనభై రోజుల తరువాత మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం తెరుచుకుంది. ఈ రోజు ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి.  మొదటి రెండు రోజులు స్థానికులు,  ఆలయ సిబ్బందికి  మాత్రమే 
దర్శనం అని పదో తేదీ నుంచి ఇతర ప్రాంతాల భక్తులను అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వామి వారిని దర్శించుకున్నారు.  చరిత్రలో ఇన్ని రోజుల పాటు  దేశవ్యాప్తంగా దేవాలయాలు మూతపడటం ఇదేనని అన్నారు.

Video Top Stories