Asianet News TeluguAsianet News Telugu

వాలంటీర్లు వైసిపి కోసం పనిచేయవచ్చు... తప్పేమీ లేదు..; మంత్రి ధర్మాన సంచలనం

శ్రీకాకుళం : ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించేందుకు కృషి చేయాలని స్వయంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు బహిరంగంగానే కోరారు.

శ్రీకాకుళం : ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించేందుకు కృషి చేయాలని స్వయంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు బహిరంగంగానే కోరారు. ప్రభుత్వంలో భాగమైన వాలంటీర్లు  సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేయవచ్చని... తద్వారా మంచి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలో చెప్పొద్దని ఎవరన్నారు... మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రతి పౌరుడికి వుంటుంది... వాలంటీర్ కూడా ఓ పౌరుడే కదా అని ధర్మాన అన్నారు. 

పొరపాటున చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చాడంటే ముందుగా పోయేది వాలంటీర్లేనని ధర్మాన అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే మొదట ఫైరింగ్ జరిగేది వాలంటీర్ల పైనే... అలా జరక్కుండా మీరే ముందుగా గుండు పేల్చితే సరిపోతుంది కదా అని వాలంటీర్లకు మంత్రి ధర్మాన సూచించారు.