Asianet News TeluguAsianet News Telugu

యజమాని ఏటిఎం నుండి లక్షలు కొట్టేసిన పనిమనిషి.. మెసేజులు చూసుకోని డాక్టరమ్మ.. చివరికి..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని దేశాయి నర్సింగ్ హోమ్ డాక్టర్ కల్పనా దేశాయ్ ఇంట్లో పనిమనిషి దాదాపు 15 లక్షలు కాజేసి పట్టుబడింది.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని దేశాయి నర్సింగ్ హోమ్ డాక్టర్ కల్పనా దేశాయ్ ఇంట్లో పనిమనిషి దాదాపు 15 లక్షలు కాజేసి పట్టుబడింది. వివరాల్లోకి వెడితే డాక్టర్ ఇంట్లో పనిచేసే లక్ష్మి ఫిబ్రవరిలో పోస్టులో వచ్చిన ఏటిఎం కార్డును దొంగిలించి దఫదఫాలుగా లక్షల రూపాయలు డ్రా చేసింది. నాలుగు నెలల తరువాత చెక్ బౌన్స్ అవ్వడంతో డబ్బులు అకౌంట్లో మాయమైన సంగతి కనుక్కున్న డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంక్వరీలో పనిమనిషి పనే అని తెలియడంతో ఆమెనుండి  రూ 11 లక్షల 80 వేలు నగదు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ముద్దాయి లక్ష్మి తో పాటు ఆమె కుమారుడు గణేష్, చెల్లెలు నాగవేణి వారి అబ్బాయి సాయిని అరెస్టు చేశారు. 

Video Top Stories