Asianet News TeluguAsianet News Telugu

దాచేపల్లి నూతన ఛైర్ పర్సన్ గా సుబ్బమ్మ ప్రమాణస్వీకారం...

పల్నాడు : దాచేపల్లి నగర పంచాయితీ మాజీ ఛైర్ పర్సన్ రమాదేవి మృతిచెందడంతో ఆ స్థానంలో  కొప్పల సుబ్బమ్మ నియమితులయ్యారు. 

పల్నాడు : దాచేపల్లి నగర పంచాయితీ మాజీ ఛైర్ పర్సన్ రమాదేవి మృతిచెందడంతో ఆ స్థానంలో  కొప్పల సుబ్బమ్మ నియమితులయ్యారు. ఇవాళ దాచేపల్లి పంచాయితీ కార్యాలయంలో గురజాల ఆర్డివో అద్దయ్య అద్యక్షతన నూతన ఛైర్ పర్సన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాసు మహేష్ రెడ్డి నూతన ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సుబ్బమ్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దాచేపల్లి అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన ఛైర్ పర్సన్ సుబ్బమ్మ తెలిపారు. 

Video Top Stories