Asianet News TeluguAsianet News Telugu

వైభవంగా వీరమ్మ తల్లి తిరునాళ్లు... ఉయ్యూరుకు పోటెత్తిన భక్తులు

ఉయ్యురు : శ్రీ పారపూడి కనకచింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ కోసం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు సుందరంగా ముస్తాబయ్యింది. 

ఉయ్యురు : శ్రీ పారపూడి కనకచింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ కోసం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు సుందరంగా ముస్తాబయ్యింది. గత వారం రోజులుగా వీరమ్మతల్లి ఆలయంవద్ద ఉత్సవాలు కొనసాగుతుండగా ఇవాళ (ఆదివారం) సెలవురోజు కావడంతో భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ కూడా ఇవాళ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మొక్కులు తీర్చుకునేందుకు, నైవేధ్యం సమర్పించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసారు.