Asianet News TeluguAsianet News Telugu

ఈవో డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగిన విజయవాడ దుర్గమ్మ సన్నిధి..

విజయవాడ : అమ్మవార్ల నామస్మరణతో మారుమోగాల్సిన విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఈవో డౌన్ డౌన్ అనే నినాదాలతో మారుమోగింది.

విజయవాడ : అమ్మవార్ల నామస్మరణతో మారుమోగాల్సిన విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఈవో డౌన్ డౌన్ అనే నినాదాలతో మారుమోగింది. భక్తిశ్రద్దలతో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు క్యూలైన్లలో పిల్లా పాపలతో ఎంత నరకం అనుభవిస్తున్నారో ఈ ఘటన తెలియజేసింది. క్యూలైన్లలో కనీస సౌకర్యాలు కల్పించకపోగా వీఐపి దర్శనాల కోసం గంటలకు గంటలు ఆపుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఇలా క్యూలైన్లలో ఏడెనిమిది గంటలు వుండాల్సి వస్తోందని... కనీసం తాగునీరు కూడా అందించే నాధుడు లేరని తెలిపారు. పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ సామాన్య భక్తులు దుయ్యబట్టారు.

ఇదిలావుంటే మూల నక్షత్రంలో సరస్వతి దేవి అలంకరణలో వున్న అమ్మవారిని చాలామంది విఐపిలు దర్శించుకున్నారు. ఇలా సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు ప్రోటోకాల్ వాహనాల్లో పోలీసులు తమ కుటుంబసభ్యులను, బంధువులను తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంద్రకీలాద్రిపై పోలీసులు చెప్పిందే వేదంగా మారిందని... సామాన్య భక్తులనే కాదు అర్చకులను అడ్డుకుంటూ తమకు కావాల్సినవారు, బంధువులను యదేచ్చగా పోలీస్ వాహనాల్లోనే పంపిస్తున్నారు.