
CM Chandrababu Naidu Speech: వ్యవసాయం లాభసాటికి చంద్రబాబు పంచసూత్రాలు
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, అన్నదాతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పంచసూత్ర ప్రణాళికతో ముందుకెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పంచసూత్రాలపై అవగాహన కల్పించేందుకే రైతన్నా...మీకోసం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు.