Asianet News TeluguAsianet News Telugu

Nara Bhuvaneshwari : అమరావతి ఉద్యమానికి చేతి గాజులు ఇచ్చిన భువనేశ్వరి

అమరావతి ప్రజల తర్వాతే కుటుంబాన్ని తన భర్త పట్టించుకొనేవారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి చెప్పారు.

అమరావతి ప్రజల తర్వాతే కుటుంబాన్ని తన భర్త పట్టించుకొనేవారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి చెప్పారు. రాజధానిని అమరావతిలోనే
కొనసాగించాలని కోరుతూ ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న దీక్షలో చంద్రబాబుతో కలిసి భువనేశ్వరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరీ రైతులతో మాట్లాడారు. అమరావతి
ఉద్యమానికి విరాళంగా తన చేతికి ఉన్న బంగారు గాజును ఇచ్చారు. ఆ గాజును బహిరంగ వేలం వేసి, ఆ డబ్బును ఉద్యమానికి వినియోగించాలని చంద్రబాబు కోరారు.