Chalo Vijayawada: అడుగడుగునా అడ్డంకులు... వీరవల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉద్యోగుల ఆందోళన

విజయవాడ: వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీకి వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిరసనలకు సిద్దమైన ఉద్యోగసంఘాలు ఇవాళ(గురువారం) ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Chaitanya Kiran | Updated : Feb 03 2022, 11:52 AM
Share this Video

విజయవాడ: వైసిపి ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీకి వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిరసనలకు సిద్దమైన ఉద్యోగసంఘాలు ఇవాళ(గురువారం) ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా విజయవాడకు వెళ్లడానికి ఉద్యోగులు ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకోడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ , ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీకాకుళం , విజయనగరం ,విశాఖ , తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్తుండుగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగులను అదుపులోకి తీసుకుని వీరవల్లి పోలీసు స్టేషన్ తరలించారు. ఈ క్రమంలో వీరవల్లి పోలీసు స్టేషన్ వద్దే ఉద్యోగులు అందోళన చేపట్టారు. 

Related Video