Asianet News TeluguAsianet News Telugu

ఏపీలోనూ అధికారం దిశగా బిజెపి... భవిష్యత్ లో జరిగేదిదే..: సాదినేని యామిని

విజయవాడ : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పుంజుకుని అధికారం దిశగా ముందుకు వెళుతుందని బిజెపి రాష్ట్ర మహిళా యువ మోర్చా అధ్యక్షురాలు యామిని శర్మ అన్నారు.

విజయవాడ : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పుంజుకుని అధికారం దిశగా ముందుకు వెళుతుందని బిజెపి రాష్ట్ర మహిళా యువ మోర్చా అధ్యక్షురాలు యామిని శర్మ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి తమ పేరు, పార్టీ రంగులతో ప్రచారం చేసుకుంటోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారిమళ్ళించి రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో అత్యద్భుతంగా ఉందని యామిని అన్నారు. వైసీపీ నాయకులు పనిగట్టుకుని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ పై వైసిపి నాయకుల విమర్శలు దేనికి సంకేతం అని యామిని నిలదీసారు.