విశాఖ తీరంలో పారాగ్లైడింగ్ ... మంత్రి సురేష్ కు తప్పిన ప్రమాదం
విశాఖపట్నం : ఏపీ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది.
విశాఖపట్నం : ఏపీ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలోని ఆర్కూ బీచ్ లో పారా గ్లైడింగ్ చేసేందుకు మంత్రి ప్రయత్నించారు. అయితే వాతావరణ సహకరించకపోవడంతో పైకి ఎగరముందే మంత్రి ఎక్కిన పారాగ్లైడింగ్ కుదుపులకు గురయ్యింది. దీంతో వెంటనే పోలీసులు, మంత్రి సురేష్ వ్యక్తిగత సిబ్బంది అలర్డ్ అయ్యారు. పరుగున వెళ్లి ఆదిమూలపు సురేష్ కు ఎలాంటి ప్రమాదం జరక్కుండా జాగ్రత్తపడ్డారు.