2024 లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్న ఐక్య కూటమిలోకి బీఆర్ఎస్ చేరుతుందా? అనేది ఇప్పటి వరకు సస్పెన్స్గానే ఉన్నది. అయితే, కొన్ని విశ్వసనీయ వర్గాల ప్రకారం, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున.. అందునా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడం వల్ల ఈ కూటమిలో చేరే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. భవిష్యత్లో కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని వివరించింది.