Maharashtra murders: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు గుర్తించారు. నిందితులపై బ్లాక్ మ్యాజిక్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.