Maharashtra murders: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు గుర్తించారు. నిందితులపై బ్లాక్ మ్యాజిక్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Maharashtra murders: మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించిన ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కుటుంబ సభ్యులది ఆత్మహత్య కాదనీ, పథకం ప్రకారం చేసిన హత్య అని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు మాంత్రికుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గుప్తనిధుల కోసం.. ఆ కుటుంబం నుంచి నిందితులు ధీరజ్ చంద్రకాంత్ సురవశే, అబ్బాస్ మొహ్మద్ అలీ బాగ్వాన్ ఈ దారుణానికి పాల్పడ్డారనీ, వారిపై విషప్రయోగం చేసినట్టు ఎస్పీ దీక్షిత్ గేడామ్ పేర్కొన్నారు. నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై బ్లాక్ మ్యాజిక్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సాంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో నివసిస్తున్న మానిక్ వాన్మోర్, పోపట్ వాన్మోర్ అనే వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ములు.. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిదిమంది ఉండేవారు. గత నెల 20న మొత్తం కుటుంబ సభ్యులు 9 మంది ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. తొలుత ప్రాథమిక దర్యాప్తులో అన్నదమ్ములిద్దరూ అప్పుల పాలు కావడంతో కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని భావించారు.
కానీ, ఈ వ్యవహారం అక్కడితో అయిపోందని భావించారు. విచారణ సమయంలో పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. దీంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు విస్తుకోలిపే ..షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. కుటుంబ సభ్యులది ఆత్మహత్య కాదని విషం ఇచ్చి వారిని చంపేశారని గుర్తించారు.
ధీరజ్ చంద్రకాంత్, అబ్బాస్ మహమ్మద్ అలీ అనే ఇద్దరు మాంత్రికులు గుప్తనిధుల కోసం వాన్మోర్ కుటుంబం నుంచి భారీ మొత్తంలో నగదును వసూల్ చేశారు. కానీ, వారు చేసిన పనులు ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో అన్నదమ్ములిద్దరూ తమ డబ్బులు.. తమకు కావాలని, తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా.. మాంత్రికులను గట్టిగా హెచ్చరించారు.
ఈ క్రమంలో ప్రసాదం పేరుతో విషం కలిపిన స్వీట్స్ ఇచ్చారు. కుటుంబ సభ్యులను చంపిన తర్వాత, నిందితులు మాణిక్ నివాసానికి వెళ్లి.. మొత్తం తొమ్మిది మంది బాధితుల జేబుల్లో సూసైడ్ నోట్లను చొప్పినట్టు గుర్తించారు పోలీసులు. దీంతో నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై బ్లాక్ మ్యాజిక్ చట్టం 2013 సెక్షన్లను ప్రయోగించినట్టు పోలీసులు చెప్పారు.
ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోల్హాపూర్ రేంజ్) మనోజ్ కుమార్ లోహియా మాట్లాడుతూ.. బగ్వాన్ "గుప్త ధన్" (దాచిన నిధి) అన్వేషణలో సహాయం చేస్తాననే నెపంతో వాన్మోర్ సోదరుల నుండి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడని, నిధికి సంబంధించి ఇచ్చిన హామీ నెరవేరలేదు. దీంతో వారిని తమ డబ్బును తమకు ఇవ్వాల్సిందిగా కుటుంబం తరచుగా కోరింది.