Indian democracy: దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయని ఇప్పటికే పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. దీనికి కారణాల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ కావడం కూడా ఒకటని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గోవాలో గత ఐదేండ్లలో ఏకంగా 60 శాతం ఎమ్మెల్యేలు పార్టీలు మారారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఓటర్ల నిర్ణయాన్ని స్పష్టంగా అగౌరపర్చారని తెలిపింది.