Asianet News TeluguAsianet News Telugu

జూబ్లీహిల్స్ లో మసాజ్ మాటున వ్యభిచారం... రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డ 9మంది అమ్మాయిలు, ఇద్దరు విటులు

మసాజ్ ముసుగులో వివిధ ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచార దందా నిర్విస్తున్న ఓ స్పా సెంటర్ పై పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో నిర్వహకులతో పాటు తొమ్మిదిమంది యువతులు, ఇద్దరు విటులు పట్టుబడ్డారు. 

Prostitution racket running in spa center busted in hyderabad jubileehills
Author
Hyderabad, First Published May 17, 2022, 9:47 AM IST

హైదరాబాద్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్ గుట్టురట్టు చేసారు హైదరాబాద్ పోలీసులు. పక్కా సమాచారంతో మసాజ్ సెంటర్ పై నిఘావుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకుని దాడులు నిర్వహించారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిర్వహకులతో పాటు యువతులు, విటులను అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతాల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలను వ్యభిచార ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి. ధనికుల పిల్లలు, ప్రముఖులను సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ఆకర్షిస్తూ భారీగా డబ్బులు వసూలు చేసి అమ్మాయిలను సెట్ చేస్తున్నారు. అయితే వ్యభిచారం జరుగుతున్నట్లు బయటపడకుండా బయటకు స్పా సెంటర్, బ్యూటీ పార్లర్ కలరింగ్ ఇస్తున్నారు ఈ గలీజ్ దందా నిర్వహకులు. 

తాజాగా జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇలా మసాజ్ ముసుగులో గుట్టుగా గలీజ్ దందా సాగిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు.  కస్టమర్ మాదిరిగా పోలీసులు ఫోన్ చేసి అమ్మాయిలతో కూడా క్రాస్ మసాజ్ సదుపాయం వుందని నిర్వహకులు తెలిపారు. అంతేకాదు అమ్మాయిలతో ఏకాంతంగా గడిపే అవకాశం కూడా వుంటుందని... అందుకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వుంటుందని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.   

దీంతో పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారణకు వచ్చి సదరు స్పా సెంటర్ పై దాడి చేసారు. స్పా సెంటర్ నిర్వహకులతో పాటు తొమ్మిదిమంది యువతులు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను రెస్క్యూ హోంకు తరలించిన పోలీసులు నిర్వహకులు, విటులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 
 
ఇదిలావుంటే ఇటీవల ఇలాగే ఎవ్వరికీ అనుమానం రాకుండా మియాపూర్ లో ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో గుట్టుగా వ్యభిచార దందా సాగిస్తున్న ముఠాను పోలీసులకు చిక్కింది.  గోకుల్ ప్లాట్స్ ఆదర్శనిలయం అపార్ట్ మెంట్ లో ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్యామిలీస్ నివాసముండే ఈ అపార్ట్ మెంట్ లో 501 ప్లాట్ లో గలీజ్ దందా సాగిస్తున్నాడు. సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా విటులను ఆకర్షించేవాడు. వారినుండి భారీగా డబ్బులు వసూలుచేసి కోరుకున్న అమ్మాయిలతో ప్లాట్ కు పంపేవాడు.  

అయితే ఈ ప్లాట్ లోకి ఎవరెవరో వస్తుండటంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సదరు ప్లాట్ పై నిఘావుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ప్లాట్ పై దాడి చేయగా మహబూబ్ నగర్ జిల్లా అనంతవరం మండలం అంబగిరి గ్రామానిక చెందిన బాలు(37),  రంగారెడ్డి జిల్లా ఫరూక్ మండలం చిలకమర్రికి చెందిన కృష్ణయ్య (46) తో పాటు ఇద్దరు మహిళలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే నిర్వహకుడు ప్రభాకర్ రెడ్డి మాత్రం పోలీసులకు చిక్కలేదు.   

కాగా ఎల్బీ నగర్ లో కూడా వ్యభిచార గృహంపై ఇటీవల పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  నాగోలు బండ్లగూడ కృషి నగర్ లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా టైలరింగ్ చేస్తుంది. ఈ వృత్తి ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి మహిళలకు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆమె నివాసం మీద దాడి చేయగా వ్యభిచారం చేస్తూ అనూష, కొత్తపేటకు చెందిన గురజాల అనిల్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచ నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios