పాకిస్ధాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ 45 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్దం అనివార్యమైతే ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.