సుహాసినీ పోటీపై పంచ్ వేసిన కేసీఆర్
టీడీపీ కూకట్ పల్లి అభ్యర్థిగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినీ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
మహాకూటమిలో భాగంగా టీడీపీ కూకట్ పల్లి అభ్యర్థిగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినీ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో తాను టీఆర్ఎస్ ని ఓడించి విజయం సాధిస్తానని ఆమె ధీమా కూడా వ్యక్తం చేశారు.
కాగా ఆమెకు టికెట్ కేటాయించడంపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పంచ్ వేశారు. వచ్చే నెలలో తెలంగాణ ఎన్నికలు ఉండగా.. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా.. సోమవారం నుంచి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
సోమవారం ఖమ్మం, పాలకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. మహాకూటమిపై విమర్శల వర్షం కురిపించారు.దీంతోపాటు సుహాసినపై కూడా పంచ్ లు వేశారు.
కొందరు కులం పేరు చెప్పుకొని ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నారని.. అలాంటి వారిని నమ్మి వారికి ఓట్లు వేసి మోసపోవద్దంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కమ్మ కులస్థులు ఎక్కువ మంది ఉన్నారనే కారణంతోనే సుహాసినీ ని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
read more news
సుహాసిని.. మా చెల్లిలాంటిది.. ప్రత్యర్థి కృష్ణారావు
సుహాసినీ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే
కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని
సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య
ఎన్టీఆర్కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని
బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి
మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి
అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని
హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని
నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు
కూకట్పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి