ఒకటి నుంచి ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ సేల్:31 వరకు ఐఫోన్పై రూ.25వేలు తగ్గింపు
ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఈ నెల 27 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు రకరకాల ఆఫర్లను వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఇచ్చే డిస్కౌంట్ సేల్స్లో 80 శాతం వరకు ధరలో రాయితీ లభిస్తుంది. ఈ నెల 27-31 మధ్య సాగే మరో ఆఫర్ కింద ఐఫోన్ల నుంచి మిగతా ఫోన్ల ధరలు రూ.25 వేల నుంచి రూ.5000 వరకు తగ్గించి కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది.
న్యూఢిల్లీ: ఆన్ లైన్ రిటైల్ సంస్థ ‘ఫ్లిప్కార్ట్’ మరోసారి డిస్కౌంట్ సేల్కు తెరతీసింది. జూన్ ఒకటో తేదీ నుంచి మూడవ తేదీ వరకు నిర్వహించే ఈ సేల్లో టీవీలు, ఇతర గృహోపకరణాలతోపాటు ఇతర ప్రొడక్ట్లపై కూడా ఆఫర్లను ప్రకటించింది. మరోవైపు ఈ నెల 27 నుంచి 31 వరకు మంత్ ఎండ్ సేల్స్ పేరిట మరో ఆఫర్ అమలు చేస్తోంది. ఇందులో ఆపిల్ ఐఫోన్ ధరలపై రూ.25 వేలు తగ్గింపు అందుబాటులో ఉంది.
నెలవారీగా అందించే రూ.1 సేల్తోపాటు పాటు ల్యాప్టాప్స్, హెడ్ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డు లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
కిరణా సరుకులపై రూ.1 డీల్స్ను అందిస్తోంది. టీవీలపై 75శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ల్యాప్టాప్స్, హెడ్ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్పై 80 శాతం డిస్కౌంట్ దీంతోపాటు మరికొన్ని ఉత్పత్తులపై అదనంగా 15శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
హోం అండ్ ఫర్నిచర్పై 30నుంచి 75శాతం దాకా డిస్కౌంట్తోపాటు ఫ్యాషన్ ఉత్పత్తులపై 40-80శాతం తగ్గిస్తోంది. బేబీకేర్, బ్యూటీకేర్, పిల్లల బొమ్మలు, బుక్స్పై 80శాతం దాకా తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక బోట్, సోనీ, జేబీఎల్ వంటి హెడ్ ఫోన్ బ్రాండ్లపై 70 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
హెచ్పీ, ఎసర్ వంటి సంస్థల లాప్ టాప్లు రూ.12,990లకే అందుబాటులోకి రానున్నాయి. పవర్ బ్యాంక్స్, మొబైల్ యాక్సెసరీస్ రూ.99లకే లభిస్తున్నాయి. ఈఎంఐ ఆప్షన్ లేకపోగా, వారంటీ పొడిగిస్తోంది. ఈ విభాగంలో ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక థామ్సన్, వీయూ మోడల్ టీవీలపై 75 శాతం రాయితీతో రూ.12,499లకే లభ్యం కానున్నాయి.
ఇక మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఐ ఫోన్, నోకియా, హానర్ బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ సేల్ నిర్వహిస్తోంది. బిగ్ షాపింగ్ సేల్ మిస్ అయినవారికి ఈ మంత్ ఎండ్సేల్ ఉపయోగపడుతుందని ఫ్లిప్కార్ట్ భావిస్తోంది.
ఈ సేల్లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రెగ్యులర్ డిస్కౌంట్తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. కేవలం రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది.
64జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల ఆపిల్ ఐఫోన్ ఎక్స్ రూ.66,499కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.91,900. సుమారు రూ.25 వేల వరకు భారీగా తగ్గింపు అందుబాటులో ఉంది.
ఇక 3 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల నోకియా 5.1 ప్లస్ ఫోన్ ధర రూ.8,199కే అందుబాటులో ఉంది. నోకియా 6.1 ఫోన్ అసలు ధర రూ.17,600కాగా, రూ.12,999లకే లభిస్తోంది. హానర్ 9ఎన్ అసలు ధర. 13,999 కాగా, ధర రూ.8,499లకే అందుబాటులో ఉంది.
ఇంకా 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ గల హానర్ 10 లైట్ ఫోన్ అసలు ధర రూ. 16, 999 కాగా రూ.11,999 లభిస్తోంది. ఎంఐ ఏ2 ఫోన్ను రూ.9,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇంకా శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 రూ. 36,990 (రూ.74,000)లకే లభిస్తుండగా, గెలాక్సీ ఎ 20పై రూ.1500 ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.