Asianet News TeluguAsianet News Telugu

వాళ్ల వల్లే నేను ఇలా...క్వాలిఫయర్2 తర్వాత శ్రేయాస్

ఐపీఎల్ 2019 క్లైమాక్స్ కి చేరుకుంది. ఫైనల్స్ లో చెన్నై, ముంబయి తలపడున్నాయి. ఢిల్లీ క్యాపిట్సల్.. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవిచూసింది.

Shreyas Iyer Says MS Dhoni, Virat Kohli, Rohit Sharma's Influence Improved Him As Captain
Author
Hyderabad, First Published May 11, 2019, 10:31 AM IST

ఐపీఎల్ 2019 క్లైమాక్స్ కి చేరుకుంది. ఫైనల్స్ లో చెన్నై, ముంబయి తలపడున్నాయి. ఢిల్లీ క్యాపిట్సల్.. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత.. తన ఐపీఎల్ అనుభవాలను ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ మీడియాతో పంచుకున్నారు.

‘‘తన జట్టుని చూస్తే తనకు చాలా గర్వంగా ఉంది. టాస్ వేసే సమయంలో  దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వారి పక్కన నిల్చొడం  చాలా ఆనందంగా ఉంది. వాళ్ల దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అది నాకు ఎంతగగానే ఉపయోగపడింది.’’ అని శ్రేయాస్ అయ్యర్ తెలిపారు. 

‘‘ ఒక కెప్టెన్ గా నాకు మా జట్టు యజమానులు చాలా మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. నా జట్టు విషయంలో మాత్రం నేను చాలా గర్వంగా ఉన్నాను. ఇంత దూరం రావడానికి చాలా కష్టపడ్డాం. ఈ ఐపీఎల్ సీజన్ మాకు కేవలం ప్రారంభం మాత్రం.. ఇంకా  చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.’’ అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios