ఆస్ట్రేలియాతో సిరీస్.. జట్టు నుంచి పాండ్యా ఔట్
మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై టీ20 సిరీస్ ఉందనగా.. భారత్ కి ఎదురుదెబ్బ తగిలింది.
మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై టీ20 సిరీస్ ఉందనగా.. భారత్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆసీస్ గడ్డపై ఆ దేశ జట్టును టీం ఇండియా చిత్తుగా ఓడించి.. సిరీస్ లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. మరో మూడు రోజుల్లో విశాఖ వేధికగా రెండు జట్లకు టీ20 మ్యాచ్ జరగనుంది.
కాగా.. మ్యాచ్ కి ముందు భారత్ ఊహించని దెబ్బ తగిలింది. వెన్ను భాగంలో గాయం కారణంగా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఈ సిరీస్కి దూరమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ గురువారం ఓ ప్రకటన చేసింది.
అయితే పాండ్యా స్థానంలో ఐదు వన్డేలకి గాను జట్టులోకి రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. కానీ టీ-20 సిరీస్కు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. కాగా పర్యాటక జట్టుతో భారత్ ఈ సిరీస్లో 2 టీ-20లు, ఐదు వన్డేల్లో తలపడనుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుంది.