కోహ్లీ అసలు మనిషేనా.. బంగ్లా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్భాల్. నిన్న మీడియాతో మాట్లాడిన తమీమ్ భారత కెప్టెన్ కొన్నిసార్లు అసలు మనిషిలా అనిపించడని అన్నాడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్భాల్. నిన్న మీడియాతో మాట్లాడిన తమీమ్ భారత కెప్టెన్ కొన్నిసార్లు అసలు మనిషిలా అనిపించడని అన్నాడు..
ఆయన ఆడుతున్న తీరు చూస్తుంటే అతను అసలు మనిషేనా అని అనిపిస్తుంది.. కోహ్లీ బ్యాటింగ్ చేసే విధానం అలా ఉంటుంది.. ప్రతి మ్యాచ్లోనూ వంద పరుగులు చేసేలా కనిపిస్తున్నాడు’’ అని ఇక్భాల్ ఆకాశానికెత్తేశాడు.
‘‘ గత 12 ఏళ్లుగా సాగుతున్న నా క్రికెట్ జీవితంలో ఎంతోమంది దిగ్గజాలను చూశాను.. వారిలో ఎవరి ప్రత్యేకత వారిదే.. ఐతే నాకు వారిలో కోహ్లీని డామినేట్ చేసే ఆటగాడు ఒక్కరు కూడా కనిపించలేదు.
బహుశా మూటు ఫార్మాట్లలో అతనే ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్మెన్ కావొచ్చు అని ఇక్బాల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఐసీసీ టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్వన్గా కొనసాగుతున్నాడు. ఇంకో 81 పరుగులు పూర్తి చేస్తే పదివేల పరుగుల క్లబ్లోకి ప్రవేశిస్తాడు.
సచిన్ను దాటేందుకు.. కావాలి ఒక ‘సిక్స్’
''వీల్చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''
సచిన్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ...క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు
మరో రికార్డ్ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ