తెలంగాణ అకాడమీలో నిధులు కొల్లగొట్టిన నిందితులే ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాహా చేశారని తెలంగాణ పోలీసులు తమకు సమాచారం అందించారని వేర్ హౌసింగ్ అధికారులు తెలిపారు.
Andhra Pradesh Oct 13, 2021, 2:53 PM IST
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు సహనిందితులే వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు. హైదరాబాదులోని అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్ మొదట స్వాల్ కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు.
Telangana Oct 13, 2021, 9:09 AM IST
రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ ముఠా (sai kumar gang) డబ్బులు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ (ap warehousing corporation) నుంచి రూ.10 కోట్లు కొట్టేశాడు సాయికుమార్.
Telangana Oct 12, 2021, 8:10 PM IST
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో నిందితులు సీసీఎఎస్ పోలీసుల విచారణలో వింత సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు నిందితులు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం.
Telangana Oct 12, 2021, 7:12 AM IST
ఏసీపీ మనోజ్ కుమార్ నేతృత్వంలోని అధికారులు ఈ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కొన్ని అనుమానాస్పద అంశాలపై మాత్రం నిందితులను కలిసి విచారిస్తూ వాస్తవాలను నిర్ధారించుకుంటున్నారు. ప్రధాన నిందితుడు సాయి కుమార్ telugu akademi scamలో తన వాటాగా 20 కోట్లకు పైగా తీసుకున్నాడని ఇప్పటివరకు గుర్తించారు.
Telangana Oct 11, 2021, 8:51 AM IST
ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. telugu akademi కి చెందిన రూ.64.5 కోట్ల నిధులను నిందితులు పథకం ప్రకారంగా బ్యాంకుల నుండి డ్రా చేశారని సీసీఎస్ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే దానిపై సీసీఎస్ పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.
Telangana Oct 10, 2021, 10:14 AM IST
తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. రమేష్ సహా పలువురిని ఈడి అధికారులు ప్రశ్నించారు.
Telangana Oct 9, 2021, 5:58 PM IST
తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో సీసీఎస్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 14కు చేరుకుంది. తాజాగా అరెస్టయిన ముగ్గురు ప్రధాన నిందితుడు సాయి కుమార్ కు సహకరించినట్లు భావిస్తున్నారు.
Telangana Oct 9, 2021, 5:08 PM IST
తెలుగు అకాడమీలో నిధుల కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సోమిరెడ్డిని విధులనుండి తప్పించింది ప్రభుత్వం. సోమిరెడ్డి వద్ద వినయ్ కుమార్ పీఏ పనిచేశారని పోలీసులు తెలిపారు.
Telangana Oct 8, 2021, 5:05 PM IST
మనీలాండరింగ్ చట్టం కింద ఈ కేసును ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు చెప్పారు.ఈ కేసులో ఇప్పటికే 11 మందిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana Oct 8, 2021, 9:56 AM IST
అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ నుంచి తక్కువ ధరకే డీజిల్ ఇస్తామంటే ఓ డీలర్ కు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానని అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్లు సమాచారం.
Telangana Oct 8, 2021, 9:46 AM IST
ఈ స్కామ్ లో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ స్కామ్ పై తొలిసారిగా సెప్టెంబర్ 27న కేసు నమోదైందని ఆయన గుర్తు చేశారు.
Telangana Oct 6, 2021, 1:32 PM IST
ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలుగు అకాడమీలో సుమారు . రూ. 324 కోట్ల నిధులను డ్రా చేయాలని ముఠా సభ్యులు ప్లాన్ చేశారని ccs పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
Telangana Oct 6, 2021, 1:05 PM IST
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కు పునాదులు ఎక్కడ పడ్డాయనేది చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు అకాడమీ పరువు ప్రతిష్టలను పూర్తిగా దిగజార్చాయి.
Literature Oct 5, 2021, 9:59 PM IST
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసు దర్యాప్తును సీసీఎస్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
Telangana Oct 4, 2021, 6:03 PM IST